Monday, April 29, 2024

CM KCR: 4 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

ఇవాళ సీఎం కేసీఆర్ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పర్యటించనున్నారు. గద్వాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంపూర్‌లో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 2 గంటలకు కొల్లాపూర్‌లో, 3 గంటలకు నాగర్‌కర్నూల్‌, సాయంత్రం 4 గంటలకు కల్వకుర్తిలో జరిగే సభలకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గ కేంద్రాలు ఇప్పటికే గులాబీ మయమయ్యాయి. సభా వేదిక చుట్టూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రహదారులన్నీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement