Saturday, April 27, 2024

ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్సీల‌కు సీఎం అభినంద‌న‌లు..

ఈ రోజు శాసన మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దండె విఠల్, కోటి రెడ్డి, భాను ప్రసాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సెంట‌ర్ల‌లో అభివృద్ధి పరంగా మ‌రింత చొర‌వ చూపాల‌ని, ప్ర‌జ‌ల‌కు చేదోడువాదోడుగా నిలిచి అన్ని విధాలా వారికి స‌హ‌కారాలు అందించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల్లో మంచిపేరు తెచ్చుకుని.. పార్టీ పేరును నిల‌బెట్టాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement