Sunday, April 28, 2024

TS | శంషాబాద్ శివారులో చిరుత సంచారం?.. అడ‌విపిల్లి అంటున్న అధికారులు!

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందనే వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర‌వుతున్నారు. నర్కుడ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరిస్తుందంటూ గ్రామస్తులు పోలీసులకు, అట‌వీశాఖ అధికారుల‌కు సమాచారం అందించారు.

సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను అట‌వీశాఖ అధికారులు, పోలీసులు పరిశీలించారు. అది చిరుత కాదని, అడవి పిల్లి అని అట‌వీశాఖ అధికారులు తేల్చారు. స్థానికులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement