Tuesday, April 30, 2024

ADB: ఈనెల 16న జ‌డ్పీటీసీ ప‌ద‌వికి రాజీనామ చేయ‌నున్న‌ చంద్ర‌శేఖ‌ర్ ….

జన్నారం, ఫిబ్ర‌వరి 3 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం జడ్పిటిసి సభ్యుడు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎర్ర చంద్రశేఖర్ రాజీనామాకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 16న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు జిల్లా పరిషత్ సూపరిండెంట్ బాలకృష్ణ తెలిపారు.

జడ్పీటీసీ చంద్రశేఖర్​ 16న ఆ సర్వసభ్య సమావేశంలో రాజీనామా చేయడానికి ముహూర్తం నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు. జెడ్పిటిసి సభ్యునికి సొంత మేనమామైన పొనకల్ సింగల్ విండో మాజీ చైర్మన్ శీలం రమేష్ పై గత నెల 30న పాలకవర్గంలోని 13 మంది డైరెక్టర్లలో 10 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. ప్రస్తుతం పొనకల్ సొసైటీ చైర్మన్ గా రేండ్లగూడ వాసి అల్లం రవి,వైస్ చైర్మన్‌గా గుండ మైపాల్ రెడ్డి, డైరెక్టర్లుగా సత్య గౌడ్, ఎండి సాదుపాషా, ఎ.శ్రీనివాస్, డి.సుధాకర్,కె. స్వరూప రాణి, బి.సత్యనారాయణ, జక్కుల గౌరయ్య ,మరియ ఎన్నికయ్యారు. దీంతో శీలం రమేష్ చైర్మన్ పదవి కోల్పోవడంతో మనస్థాపానికి గురైన ఆయన రాజీనామా చేయనున్నారు.ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement