Sunday, April 28, 2024

BRS – నేడు భద్రాచలంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

భద్రాచలం(టౌన్) ఫిబ్రవరి 3 (ప్రభన్యూస్): పట్టణంలోని నేడు కేకే ఫంక్షన్ హాల్ లో ఉదయం 10.30 గంటలకు, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కొరకు బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని దిశా నిర్దేశం చేయనున్నారు.

ఆయనతోపాటు స్థానిక ఎంపీ మాలోత్ కవిత, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడనున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి సమావేశం కావడంతో పార్టీ శ్రేణులు సమావేశం కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement