Sunday, April 28, 2024

అదుపు త‌ప్పి ఆటో బోల్తా… డ్రైవ‌ర్ మృతి…

చెన్నారావుపేట, ఫిబ్రవరి3 (ప్రభ న్యూస్): ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి డ్రైవర్ మరణించిన సంఘటన చెన్నారావుపేట మండలంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం సూర్యపేట తండా గ్రామానికి చెందిన ధారావతు లక్ష్మణ్ ఆటో నడుపు కుటుంబాన్ని పోషిస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం కిరాయికి వెళ్లి అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా గ్రామ శివారులో నాలుగు బాటల దగ్గర అదుపుతప్పి ఆటో బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.ఆటో బోల్తాపడిన ఆటోలో పాటలు వస్తుండడంతో శబ్దాన్ని విని ప్రమాదస్థలికి సమీపంలో ఉన్న వారు సంఘటనాస్థలనికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడికి భార్య సుజాత,కుమారుడు అనిల్,కూతురు లావణ్యలున్నారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు నర్సంపేటకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement