Saturday, May 18, 2024

పశువులకూ చలివేంద్రం.. మాన‌వ‌త్వం చాటుకున్న చెన్నూరు పోలీసులు

మంచిర్యాల జిల్లా పోలీసులు మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తుంటాం.. కానీ మంచిర్యాల జిల్లా జైపూర్ సబ్ డివిజన్లోని చెన్నూరు పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో పశువులు, జంతువులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయని గుర్తించి పశువుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆవులు ఇతర పశువులు వచ్చి నీటిని తాగ‌డంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చెన్నూరు పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ కితాబునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement