Wednesday, May 8, 2024

Breaking: మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై కేసు నమోదు

హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై కేసు న‌మోదైంది. హీరో నాని, న‌జ్రియా న‌జీమ్ , అనుపమా పరమేశ్వరన్ న‌టించిన అంటే సుంద‌రానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 9వ తేదీన మ‌దాపూర్ శిల్ప‌క‌ళా వేదిక‌లో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా క‌లిసి నిర్వ‌హించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థ‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోలేదు. దీంతో మాదాపూర్ పోలీసులు సుమోటోగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అంటే సుంద‌రానికి సినిమా నిన్న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement