Thursday, May 2, 2024

Campaign – బీఆర్‌ఎస్‌ ప్రచార రథాలు షురూ… సంగారెడ్డిలో ప్రారంభించిన ఎమ్మెల్యే చింత్రా ప్రభాకర్‌

మెదక్ లోక్​సభ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకార్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ ఇస్తామని తెలిపారు.

గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందన్నారు. పాలన అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, మామిళ్ల రాజేందర్, బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement