Thursday, May 2, 2024

హైదరాబాద్ లో వ్యాపారి కిడ్నాప్, హత్య

హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హ‌త్య చేయడం కలకలం రేపింది. చార్మినార్‌కు చెందిన వ్యాపార‌వేత్త మ‌ధుసూద‌న్ రెడ్డి వ‌ద్ద ఆయ‌న మిత్రులు రూ.40 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నారు. డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని వారిని మ‌ధుసూద‌న్ రెడ్డి అడిగారు. దీంతో ఈనెల 19న మధుసూదన్ రెడ్డిని మిత్రులు కిడ్నాప్ చేశారు. డ‌బ్బులు ఎగ్గొట్ట‌డానికి మ‌ధుసూద‌న్ రెడ్డిని కిడ్నాప్ చేసి సంగారెడ్డికి తీసుకెళ్లిన ముగ్గురు వ్య‌క్తులు… ఆయ‌న‌ను హ‌త్య చేశారు. అనంతరం మధుసూదన్ ‌రెడ్డి మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement