Wednesday, May 15, 2024

HYD: బీఎన్‌రెడ్డి డివిజ‌న్‌లో ప్ర‌చారం నిర్వ‌హించిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, డిసెంబర్ 22(ప్రభ న్యూస్)
బి.ఎన్.రెడ్డి.నగర్డివిజన్ పరిధిలోని పలు కాలనీ,అధ్యక్ష కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి,శాసనసభ్యులు.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సుధీర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 118 జీ.ఓ.తీసుకొచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందని తెలిపారు.మేము జీవితాంతం వారికి రుణపడి ఉంటామని తెలిపారు.

అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ల సహకారంతో వేలాది కోట్లతో ఎల్.బి.నగర్ ను అభివృద్ధి చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్ళలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం వేలాది కోట్లతో ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్ చౌదరి,సామ బుచ్చిరెడ్డి,సుమన్ గౌడ్,శివశంకర్,పొగుల రాంబాబు,కాజా శ్రీనివాస్,జగన్మోహన్ రావు, నాగమణి రెడ్డి, కసిరెడ్డి వెంకటరెడ్డి అమరేందర్ రెడ్డి పలువురు నాయకులు, పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement