Thursday, May 16, 2024

Renuka Chowdari : పువ్వాడ అజ‌య్ ని ఓటు అనే బ్ర‌హ్మాస్త్రంతో ఓడించాలి..

మంత్రి పువ్వాడ అజయ్ ను ఓటు అనే బ్ర‌హ్మాస్త్రంతో ఓడించాలని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ… పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమన్నారు.

పువ్వాడ అజయ్ మంత్రిగా చేసిందేమీ లేదన్నారు. నిస్సహాయంగా ఉండొద్దు ఓటు అనే బ్రహ్మాస్త్రంతో అజయ్‌ను ఓడ గొట్టాలన్నారు. మన భవిష్యత్ కోసం తుమ్మల‌ను గెలిపించాలని కోరారు. తుమ్మల కాంగ్రెస్ లో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement