Saturday, July 27, 2024

Rahul Gandhi: వరల్డ్ కప్ లో భారత్ ఓటమికి మోడీయే కారణం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు మోడీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆయన విమర్శించారు.

ఇండియా దాదాపు ప్రపంచకప్‌ను గెలుచుకుందని, కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోడీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని, కానీ దేశ ప్రజలకు అది తెలుసన్నారు. మన జట్టు గెలిచేదేనని, అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ ఫైనల్ మ్యాచ్ జరిగే స్డేడియానికి వెళ్లకుండా ఉండాల్సిందంటూ రాహుల్ తెలిపారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement