Saturday, April 27, 2024

టింబ‌ర్ డిపో ప‌ర్మిష‌న్‌ కోసం లంచం.. ఏసీబీ వలలో శంషాబాద్‌ ఎఫ్‌ఆర్‌వో

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అటవీశాఖ‌ అధికారి శ్యామ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్‌ఆర్‌వోతో పాటు విరియా నాయక్‌ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. టింబర్ డిపో ప‌ర్మిష‌న్‌ కోసం రూ.80 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. కాగా, ఎఫ్‌ఆర్‌వో అవినీతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. శంషాబాద్ ఎఫ్‌ఆర్‌వో శ్యామ్ కార్యాలయంతో పాటు నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. శంషాబాద్ కోత్వాల్‌గూడలో టింబర్ డిపో అనుమతి కోసం లంచం అడుగుతున్నారని సికింద్రాబాద్‌ తార్నాకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు ఎఫ్‌ఆర్‌వోను పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement