Sunday, May 19, 2024

Breaking : కారు..ద్విచ‌క్ర వాహ‌నం ఢీ-ఇద్ద‌రు మృతి..మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ మండలం గొట్టుముక్కల గేట్ సమీపంలో కారు.. ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలపై అపస్మార‌క‌ స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ..పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన మోహన్ కాజా ఆంజనేయులు సెంట్రింగ్ పని చేయడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు వికారాబాద్ నుండి పరిగి వైపు వెళుతూ వేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాజా, మోహన్ అక్కడికక్కడే మరణించారు.. తీవ్ర గాయాలపాలైన అంజయ్య పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు హుటాహుటిన సందర్శించి మృత‌దేహాల‌ను వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement