Monday, May 6, 2024

కాకతీయ కాలువలో పడి బాలుడు గల్లంతు

వరంగల్ జిల్లాలోని ఆరేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాకతీయ కాలువలో జారిపడి చిట్యాల యశ్వంత్ (10) అనే బాలుడు గల్లంతయ్యాడు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ సరిగా లేక బహిర్భూమి కోసం కాలువ దగ్గరకు వచ్చిన యశ్వంత్ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 18 గంటలైనా ఇంకా బాలుడి ఆచూకి దొరకలేదు. బాలుడి ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement