Wednesday, May 22, 2024

సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’

పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో సమస్యల పరిష్కారం కోసమే మీ కోసం వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 27,28 వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతోపాటు డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ గత ఏడేళ్లుగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా వార్డులో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ లతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement