Sunday, May 19, 2024

ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ నర్సింగ్ చహన్ కు దేహశుద్ధి

నారాయణఖేడ్, (ప్రభ న్యూస్) : నర్సును లైంగికంగా వేధించాడని నర్సు బంధువులు దేహశుద్ధి చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ను సునీత అనే ట్రైనీ నర్సును లైంగికంగా వేధించినాడని నర్సు బంధువులు ఈరోజు డాక్టర్ ను చితకబాదినారు. కల్హేరు మండలం బాచెపల్లి నాగని కుంట తాండకు చెందిన సునీత అనే ట్రైని నర్సు, నర్సింగ్ కోర్సు పూర్తి చేసి తర్వాత నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆసుపత్రికి సక్రమంగా రాకపోవడంతో, సర్టిఫికెట్ కోసం వెళ్లిన నర్సుకు డాక్టర్ నర్సింగ్ చౌహాన్ అసభ్యకరమైన పదజాలంతో నాకు ఏమిస్తావని ఆమెను వేధించాడు.

దీంతో నర్సు సునీత నేను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నానని అనగా నీకు ఇంకా అలా కడుపు కనబడలేదని డాక్టర్ చౌహన్ అన్నాడు. ఈ విషయం కుటుంబీకులకు, బంధువులకు తెలపడంతో ఈరోజు డాక్టర్ పై దాడి చేశారు. ఈ డాక్టర్ తీరుపై గతంలోనూ అనేక విమర్శలు వచ్చాయి. ఆసుపత్రిలో గతంలో ఓ యువతితో రాసలీలలు జరిపినట్లు పుకార్లు వచ్చాయి. అదేవిధంగా సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల వద్ద లంచాలు తీసుకోవడంతో డాక్టర్ బాగోతం బయట పెట్టారు. ఇటీవల మంత్రి హరీష్ రావు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేసిన‌ప్పుడు స్థానికులు డాక్టర్ నర్సింగ్ చహన్ పై ఫిర్యాదు చేశారు. ఇటువంటి డాక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్ రెడ్డి డాక్టర్ నర్సింగ్ చహన్ కేసు నమోదు కాగా, ఆస్పత్రిలో కొట్టినందుకు నర్సు బంధువులపై కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement