Wednesday, May 15, 2024

మంత్రి కేటీఆర్ ను కలిసిన మలావత్ పూర్ణ.. ఎందుకంటే..

తెలంగాణ స్టూడెంట్, ప్రముఖ పర్వతారోహకురాలు.. మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కే. తారకరామారావును ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.

పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరిగానే ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహంపై పూర్ణ మంత్రి కేటీ రామారావుకు ధన్యవాదాలు తెలిపారు.!

Advertisement

తాజా వార్తలు

Advertisement