Sunday, May 12, 2024

తెలంగాణలో అభివృద్ధి చెందాలంటే బిజెపి అధికారంలోకి రావాలి – సామ రంగారెడ్డి

కర్మన్ ఘాట్ ఆగస్టు2 ( ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే బిజెపి పార్టీ అధికారంలోకి రావాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. ఇంటింటికి బిజెపి కార్యక్రమం లింగోజిగూడ డివిజన్లోని అల్తాఫ్ నగర్, అధికారి నగర్, ధర్మపురి కాలనీలో నాయకులు కార్యకర్తలతో కలిసి సామ పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ, 9 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనలో ప్రజలు ఎంతో సురక్షితంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నియామకాలు, నిధులు వస్తాయని మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బి ఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో ప్రజలను నట్టేట ముంచిందని ఆయన ఆరోపించారు. లింగోజిగూడ డివిజన్లో జరిగిన బాక్స్ డ్రైన్ పనుల్లో గ్రావిటీ లెవెల్స్ సరి చేయకుండా ఇష్టానుసారంగా అతుకులు అతుకులుగా నిర్మించి నాళాలను నిరుపయోగంగా చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. నాలాల్లో నిలిచిపోయిన మురుగునీరు వల్ల దుర్వాసనతో పాటు దోమల ద్వారా విష జ్వరాలు వ్యాపిస్తున్నాయన్నారు .వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, విజయభాస్కర్ ,రాకేష్ యాదవ్, నాగరాజు, కిరణ్ కుమార్, కృష్ణారెడ్డి, ప్రవీణ్ గౌడ్, పవన్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, సాయి, రాజు గౌడ్, సాయికుమార్ ,ఈశ్వర్, కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement