Thursday, May 2, 2024

MBNR : ఈటెల రాజేందర్ సభ వేదిక హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు

మక్తల్, నవంబర్14(ప్రభన్యూస్) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటి చైర్మన్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 15న నారాయణ పేట జిల్లా మక్తల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఈటెల రాజేందర్ సభ వేదిక హెలిపాడ్ స్థలాన్ని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాది‌రెడ్డి జలంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.

బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మక్తల్ లో జరిగే బహిరంగ సభలో ఈటెల రాజేందర్ పాల్గొంటారని వారు తెలిపారు. ఈటల రాజేందర్ బహిరంగ సభకు సంబంధించి వేదిక హెలిపాడ్ ఏర్పాట్లను పూర్తి చేసేందుకు కమిటీ సభ్యులు సత్వర పూర్తిచేయాలని సూచించారు. ఈటెల రాజేందర్ సభకు వచ్చే భాజపా శ్రేణులు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, కొండయ్య మాట్లాడుతూ బుధవారం ఈటల రాజేందర్ పర్యటనకు పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి రానుందని బిజెపి ముఖ్యమంత్రిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బీసీ అని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వేదిక హెలిపాడ్ పరిశీలించిన వారిలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్ నియోజకవర్గ కన్వీనర్ కార్ని స్వామి, నాయకులు బాల్చేడ్ మల్లికార్జున్,బి .రాజశేఖర్ రెడ్డి, జి.బాలరాం రెడ్డి,సోమశేఖర్ గౌడ్ ,గడ్డం రమేష్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement