Wednesday, May 8, 2024

BJP | ఎలక్షన్​ ఇన్​చార్జిలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఎవరంటే!

బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్​చార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను పార్టీ నియమించింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇన్​చార్జిటలను నియమిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు ప్రకాశ్ జవదేకర్​ని ఇన్​చార్జిగా, సునీల్ బన్సల్ ను సహాయ ఇన్​చార్జిగా హైకమాండ్​ నియమించింది.

మరో ఐదారు నెలల్లో తెలంగాణలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్​ని తప్పించి, ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించింది. ఇతర రాష్ట్రాల విషయంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్​చార్జిగా ఓపీ మాథుర్, సహాయ ఇన్​చార్జిగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాజస్థాన్ ఇన్​చార్జిగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇన్​చార్జిగా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇన్​చార్జిగా భూపేంద్ర యాదవ్, సహాయ ఇన్​చార్జిగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను పార్టీ హైకమాండ్​ నియమించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement