Tuesday, April 30, 2024

Shiridi | సాయి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి ముర్ము.. ప్రత్యేక పూజలు

షిర్డీ, (ప్రభ న్యూస్): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షిర్డీకి చేరుకున్నారు. ప్ర‌త్యేక విమానంలో షిరిడీ సాయి నాథుడిని ద‌ర్శించుకునేందుకు ఇవ్వాల (శుక్ర‌వారం) షిరిడీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా, రాష్ట్ర‌ప‌తి ముర్ముకు గవర్నర్ రమేష్ బాయిస్, మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్ ఘ‌న స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సదాశివ లోఖండే, డివిజనల్ కమిషనర్ రాధాకృష్ణ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్వీందర్ సింగ్, కలెక్టర్ సిద్ధారాం సాలిమత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాకేష్, EO పి. శివశంకర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement