Monday, April 29, 2024

HYD : ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన కార్పొరేటర్​ లచ్చిరెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిని గెలిపించాలని బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేయడం వేయడం ఖాయమని తెలిపారు.

ప్రజలంతా డబల్ ఇంజన్ సర్కార్ కోసం ఎదురుచూస్తున్నారని ఎన్నికలలో శాసనసభ ఎల్బీనగర్ నియోజకవర్గం లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొంతం నవ కిషోర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, బొమ్మ రఘురాం నేత,శంకరయ్య గౌడ్, విష్ణువర్ధన్ రావు, శరత్ కుమార్, సంతోష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి, సంతోషి, సౌమ్య, వనజ, జ్యోతి, నాయకులు జైపాల్ రెడ్డి, రవిశంకర్, శ్రీధర్ రావు, మహేష్ గౌడ్, శివశంకర్ గౌడ్, చందు, నరసింహారెడ్డి, రమేష్, నారాయణ, ప్రశాంత్ రెడ్డి, సురేష్ కుమార్, భరత్, ప్రేమ్, గౌరీ శంకర్, భాను, దుర్గాప్రసాద్, శివకుమార్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement