Saturday, May 4, 2024

HYD : ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన ఎల్భీన‌గ‌ర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్‌రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 16 (ప్రభ న్యూస్) బంగారు తెలంగాణ కావాలంటే కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎల్బీనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లినట్లు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీ, చంప‌పేట్‌లో, వివిధ బస్తీలలో గురువారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అందోజు సత్యం చారి ,గజ్జల మధుసూదన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీను నాయక్, మే రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ,విష్ణు గౌడ్, సల్వా చారి కంచర్ల శివారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement