Wednesday, May 1, 2024

Breaking: మంత్రి మ‌ల్లారెడ్డికి చేదు అనుభ‌వం.. రెడ్ల సింహ‌గ‌ర్జ‌న‌లో చెప్పులు, రాళ్లు!

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో జ‌రిగిన రెడ్ల సింహగర్జనలో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా కొందరు సభికులు అడ్డుకున్నారు. ప‌దే ప‌దే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ అనడంతోనే ఇట్లా జ‌రిగింద‌ని తెలుస్తోంది. మ‌ల్లారెడ్డి మాట్లుడుతుంటే చెప్పులు, రాళ్లు విసిరేసిన‌ట్టు స‌మాచారం. దీంతో ప్రసంగం ముగించుకుని ఆక‌స్మికంగా మంత్రి మ‌ల్లారెడ్డి వెళ్లపోతున్న క్రమంలో కూడా ఆయన వాహన శ్రేణిపై కుర్చీలు, రాళ్లు విసిరారు. దీంతో రెడ్ల సింహగర్జన సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement