Sunday, May 5, 2024

కర్నాటక అబ్బే జలపాతంలో మునిగి.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

కర్నాటక జలపాతంలో పడి తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. కొడగు జిల్లా మదికేరిలోని అబ్బే జలపాతంలో నీటమునిగి వీరు చ‌నిపోయిన‌ట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలకోటి శ్యామ్ (36), కక్కిరిణి శ్రీహర్ష (18), షాహీంద్ర (16)గా గుర్తించారు. వీరి స్వస్థలం సూర్యాపేటగా తెలిపారు. వారంతపు సెలవులు కావడంతో పలువురు కుశాల్‌నగర్‌లో బస చేసి, అబ్బే జలపాతాన్ని చూసేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లుగా సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement