Sunday, April 28, 2024

Bikkanur – రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు….బిఆర్ఎస్

బిక్కనూర్ నవంబర్ 12 ప్రభ న్యూస్… రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ గాల్ రెడ్డి మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడం జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి లేకుండా చేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.

ఈ . కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ వేణు, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, సిద్ధి రామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశం, పట్టణ సొసైటీ అధ్యక్షులు భూమయ్య, రామేశ్వర్ పల్లి సొసైటీ అధ్యక్షులు భూమి రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అమృతా రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement