Monday, April 29, 2024

Bhuvangiri – కరోనా కంటే భయంకరమైనది కాంగ్రెస్ …పైళ్ల వనితాశేఖర్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – కరోనా కంటే అతి భయంకరమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి పైళ్ల వనితా శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి మండలం లోని అనాజీపురం, నమాత్ పల్లి, భువనగిరి పట్టణ కేంద్రంలో భారాస అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఏనాడు కూడా రైతులను పట్టించుకోని పార్టీ , సంక్షేమాన్ని కోరని పార్టీ కాంగ్రెస్ అన్నారు. నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు రైతు బంధు ఆపాలని పిర్యాదు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు 3 గంటల విద్యుత్ చాలని, ఇప్పుడు రైతు బంధు ఇవ్వొద్దని చెప్పడం రైతుల వ్యతిరేకమే అని అన్నారు.

గ్రామాల్లోకి కాంగ్రెస్ నేతలు వస్తే నీలదీయలని పిలుపునిచ్చారు. ఈ సంధర్బంగా గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజా సంక్షేమ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోలో నిర్ణయించారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం బీఆర్ఎస్ తోని సాధ్యమవుతుందని అన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement