Saturday, April 27, 2024

bhainsa: భారీ పోలీస్ బందోబస్తు..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బైంసాలో బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతం కావడంతో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తగా మోహరించారు. మసీదులు, ప్రార్థన స్థలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రధాన ఏరియాలో 150 మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.

కమాండ్ కంట్రోల్ రూం నుండి 269 సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పట్టణ నలుమూలల నుండి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి గోవులు అక్రమ రవాణా జరగకుండా చూస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలని, పుకార్లు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement