Thursday, May 9, 2024

Kodumuru: గృహ సారథి దారుణ హత్య

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం ఎదురూరు గ్రామంలో వైఎస్సార్సీపీ గృహ సారథి, వైసీపీ కార్యకర్త అంజిగౌడ్ (34) దారుణ హత్యకు గురయ్యాడు. అంజిగౌడ్ హత్యతో గ్రామంలో అలజడి మొదలైంది. జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామంలో జరిగిన మర్డర్ తో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

గ్రామ సమీపంలోని కేసీ కేనాల్ కాల్వ వద్ద ఉన్న ఎల్.రామన్న చెరువులో గుర్తు తెలియని దుండగులు రాళ్ళు, కర్రలతో అంజిగౌడ్ ను దారుణంగా కొట్టి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం పశువుల మేత కోసం గడ్డి తెచ్చేందుకు వెళ్లిన వ్యక్తి ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలించగా చెరువులో శవమై కనిపించింది. గ్రామ ప్రజలు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి సిఐ శ్రీరామ్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement