Saturday, April 27, 2024

Banswada : బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సభాపతి

బాన్సువాడ, జూన్ 29 ప్రభ న్యూస్ : ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పండగ సందర్భంగా మైనార్టీలను అలింగనం చేసుకొని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం శాసన సభాపతి బాన్సువాడ పట్టణంలోని ఈదుగా మైదానంలో బక్రీద్ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం మైనార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మైనార్టీలు ఒకరికొకరు అలింగణం చేసుకుంటూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బాన్సువాడ పట్టణంలో పండుగ వాతావరణంలా కనిపించింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్, సొసైటీ చైర్మన్ ఏరువాల కృష్ణారెడ్డి, బాన్సువాడ భారత్ రాష్ట్ర సమితి నియోజకవర్గం ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement