Monday, May 13, 2024

Beware – కెసిఆర్ మ‌ళ్లీ గెలిస్తే అలి మీద ఉన్న తాళిని కూడా గుంజుకుపోతారుః రేవంత్ రెడ్డి

అదిలాబాద్ – మేడిగడ్డ వద్ద కట్టిన బ్యారేజ్ మేడిపండులాగా పగిలిపోయిందని.. ప్రాజెక్ట్‌ల పేరుతో లక్ష కోట్ల దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికే న్యాయం జరిగింది తప్పించి.. తెలంగాణ ప్రజలకు కాదని రేవంత్ అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సాగునీరు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారా అని రేవంత్ నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆదిలాబాద్‌ , ఖానాపూర్ లలో జరిగిన బహిరంగ సభలలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీతెలంగాణ ఇవ్వ‌డం వల్లే కేసీఆర్ కుటుంబం బాగుపడిందని తేల్చి చెప్పారు. .. కుంగిన మేడిగడ్డ, పగిలిన అన్నారంను చూడమని మోడీకి చెప్పానని ఆయన పేర్కొన్నారు. టికెట్ రానివారిని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఆశావహులు ఎంతమంది వున్నా ఒక్కరికే టికెట్ ఇవ్వగలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీళ్లను మళ్లీ గెలిపిస్తే ఆలి మీద వున్న తాళి కూడా గుంజుకుపోతారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అవినీతిపరుల పాటిట తాను చండశాసనుడినని , అవినీతిపరులను వదలనని, వారి వద్దకు సీబీఐ, ఈడీ, ఐటీని పంపిస్తామని మోడీ చెప్పిన మాట‌లు కాళేశ్వ‌రం అవినీతి విష‌యంలో ఏమ‌య్యా్య‌య‌ని నిల‌దీశారు… మేడిగడ్డ చూడకపోతే మీ పర్యటన వల్ల ఏం లాభమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ కూలిన పాపంలో మోడీకి ఎంత భాగస్వామ్యం వుందని తాను అడుగుతున్నానని ఆయన నిలదీశారు. మేడిగడ్డ గురించి మాట్లాడడు కానీ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై మోడీ మాట్లాడతారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడెం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లను కట్టింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్ అంటూ రేవంత్ గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement