Sunday, April 28, 2024

బీసీ గురుకులంలో కండ్ల కలక కలకలం… ఇబ్బంది పడుతున్న 60 మంది విద్యార్థులు

తిమ్మాపూర్ జూలై 31( ప్రభ న్యూస్)కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలినిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల (గన్నెరువరం) లో 60 విద్యార్ధులకు కండ్ల కలక సోకింది కళాశాలలో 570 మంది విద్యార్థులు ఉంటారు వారిలో 60 మంది కండ్లకల్హాతో బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు.

.హెల్త్ సూపర్వైజర్ లేక పోనడం తో.9క్లాస్ కు చెందిన అక్షయ్ అనే విద్యార్థితో డ్రాప్స్ ఇప్పించి చికిత్స చేస్తున్నారు .కండ్ల కలకతో ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి సోకుతుందని తెలిసి ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు తీసుకొని విద్యార్థులకు కంటికి రక్షణ కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement