Sunday, May 5, 2024

అత్యాచారానికి పాల్ప‌డిన వారి ఇళ్ళ‌ను బుల్ డోజ‌ర్ తో కూల్చేస్తాం – బండి సంజ‌య్

హైద‌రాబాద్ – తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ల‌ అంతు చూస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజ‌య్. మహిళలపై అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని, అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని అన్నారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి మాట్లాడుతూ తెలంగాణలో మహిళలపై అన్యాయాలు,అక్రమాలు,అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు.. మ‌హిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లలతో కూల్చేస్తాం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను కన్నెతి చూడాలంటే ఆకతాయిలు వణకేలా చేస్తామని అన్నారు.


బీఆర్ఎస్ నేత‌ల‌ను గూండాలుగా అభివ‌ర్ణిస్తూ తెలంగాణలో మహిళలను కించపరుస్తుంటే సహించలా? అంటూ ప్ర‌శ్నించారు.. ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటమే పనిగా పెట్టుకున్న కేసీఆర్,కేటీఆర్ లకు కేంద్రాన్ని తిట్టటమే పనిగా పెట్టుకున్నారు అంటూ విమర్శించారు. హిందూ దేవుళ్లను కించేపర్చేలా వారిని తాట తీస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్నిస్థానాల‌లో బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను నిలుపుతామ‌ని పేర్కొన్నారు. . బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్య‌క్తం చేశారు.. ఎద్దేవా చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement