Thursday, April 25, 2024

Breaking: పేలిన రియాక్టర్.. ఇద్దరు దుర్మరణం

రియాక్టర్ పేలి ఇద్దరు దుర్మరణం పాలైన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని జీడిమెట్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కక్కడే దుర్మరణం పాలయ్యారు. జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి రియాక్టర్ పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిపోయాయి. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement