Friday, April 26, 2024

కమీషన్ల కోసం కెసిఆర్ కక్కుర్తి..

నదీ యాజమాన్య బోర్డుల అధికారాలపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ను తెలంగాణ సర్కారు వ్యతిరేకిస్తుండడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నాడు కమీషన్ల కోసం కక్కుర్తిపడిన సీఎం కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే, కేవలం 299 టీఎంసీలకే అంగీకరించిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నీటివాటాపై ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దోచుకుపోతుంటే ఈయన చూస్తూ ఉన్నాడు తప్ప అడ్డుకోవడం లేదని విమర్శించారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను కాకుండా, అంతకు తక్కువ కేటాయింపులకు సీఎం కేసీఆర్ ఎలా ఒప్పుకొన్నారు? అని ప్రశ్నించారు. ప్రత్యేక అజెండాతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమన్న బండి… మొట్టమొదటి ప్రధాన అంశం నీళ్ల విషయంలోనే కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కమీషన్ల కోసం తెలంగాణను మోసం చేసిన కెసిఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement