Saturday, May 18, 2024

వచ్చేది బీజేపీ సర్కార్ అని పోలీసులు గుర్తుంచుకోవాలి: బండి సంజయ్

అచ్చంపేట లో బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి, శ్రీ తరుణ్ చుగ్ పాల్గొన్న ర్యాలీ పై జరిగిన దాడిని ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అనేందుకు అచ్చంపేట దాడే నిదర్శనమన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాము ఒడిపోతున్నామని తెలిసి టీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఒత్తిడి తోనే పోలీసులు బీజేపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. వచ్చేది బీజేపీ సర్కార్ అని పోలీసులు గుర్తుంచుకోవాలని సూచించారు బండి సంజయ్. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ పోలీసు అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement