Tuesday, April 30, 2024

బిజెపికి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి – ప్ర‌జ‌ల‌కు బండి అభ్య‌ర్ధ‌న‌..

హైద‌రాబాద్ – వ‌చ్చే ఎన్నిక‌ల‌లో బిజెపి ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బిజెపి తెలంగాణ శాఖ చీఫ్ బండి సంజ‌య్ అభ్య‌ర్ధించారు.. నిజాం కాలేజీలో “ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్” పేరుతో జ‌రుగుత‌న్న క్రికెట్ టోర్ని ఫైన‌ల్ మ్యాచ్ ను ఆయ‌న వీక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌స్తే అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తామ‌న్నారు.. బిఆర్ఎస్ సర్కార్ మ‌ద్యం అమ్మ‌కాల‌కే ప్రాధాన్య‌త ఇస్తుందని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై ఇప్పటికీ కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అకాల వ‌ర్షాల‌తో రైతులు ఇబ్బంది ప‌డుతుంటే ఇక్కడి రైతులను ఆదుకోవడం లేదు కానీ.. పంజాబ్ రైతులకు మాత్రం పైసలు ఇస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పూర్తిగా దివాళా తీస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కెసిఆర్ ఏ డబ్బులు పంపిస్తున్నార‌ని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement