Thursday, May 16, 2024

ఎవి సుబ్బారెడ్డిపై దాడి – భూమా అఖిల‌ప్రియ‌కు 14 రోజుల రిమాండ్

పాణ్యం ( ప్రభ న్యూస్): టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి ఆళ్లగడ్డ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి భూమా అఖిలప్రియ, భర్త భార్గవ రామ్ ల‌కు నంద్యాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.. గ‌త రాత్రి త‌న‌పై భూమా అఖిల ప్రియ‌,ఆమె భ‌ర్త , ఆమె సోద‌రుడు గ‌త రాత్రి దాడి చేశారంటూ ఏవి సుబ్బారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు..దీంతో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పాణ్యం పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.. ఆ త‌ర్వాత వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నంద్యాల కోర్టులో హాజ‌రు ప‌రిచారు .. కేసు విచారించిన న్యాయ‌మూర్తి అఖిల ప్రియ‌, భ‌ర్త భార్గ‌వ్ ల‌కు ఈ నెల 30వ తేది వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement