Friday, April 19, 2024

ఎరువుల ధ‌ర‌లు పెంచేది లేదు… కేంద్రం కేబినెట్ నిర్ణ‌యం

ఎరువుల ధ‌ర‌లు పెంచేది లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. ఇవాళ జ‌రిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల ధరలు పెంచకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ లో ఎరువులకు రూ.1.08 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం. అదేవిధంగా యూరియాకు రూ.70 వేల కోట్ల రాయితీ కల్పించాలని, డీఏపీకి రూ.38 వేల కోట్ల రాయితీ ఇవ్వాలని డిసైడ్ చేసింది. గత సంవత్సరం ఎరువుల రాయితీకి రూ.2.56 లక్షల కోట్లు ఖర్చు అయిందని కేంద్రం తెలిపింది. కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఎరువులపై సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించారు. దాంతో రానున్న రోజుల్లో ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement