Friday, May 3, 2024

Bail Sanctioned – లాయ‌ర్ దంప‌తులు హ‌త్య – మ‌రో ఇద్ద‌రికి బెయిల్

పెద్దపల్లి : జిల్లాలోని రామగిరి మండలం మారుతినగర్ సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-నాగమణి దారుణ హత్య కేసులో నిందితులైన గుంజపడుగు గ్రామానికి చెందిన ఏ3 ఊదరి లచ్చయ్య అలియాస్ లక్ష్మయ్య, ఏ5 అక్కపాక కుమార్ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.. పిటిష‌న్ ను విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

దీంతో ఇప్పటివరకు ఈ కేసులో నలుగురికి బెయిల్ లభించింది. ఇంకా ఈ కేసులో ఏ1గా ఉన్న కుంట శ్రీనివాస్, ఏ2 గా ఉన్న చిరంజీవి, ఏ4గా ఉన్న తలిసేగారి శ్రీనివాస్ అలియాస్ బిట్టు శ్రీను ఇంకా చర్లపల్లి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement