Thursday, May 2, 2024

మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ

ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆదివారం రాత్రి పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించిన ఈ పూజల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తదితరులు పాల్గొని అయ్యప్పస్వామికి నిర్వహించిన అభిషేకాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ శాలువాతో సత్కరించి, స్వామి ప్రసాదాలు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement