Thursday, May 16, 2024

Badradri: అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట…. భద్రాద్రి ఆలయంలో పూజలు, శోభాయాత్ర..

అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకలకు దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్టకు భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు, శోభాయాత్రతో పాటు పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయోధ్య రాముడి ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. రామయ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement