Sunday, April 28, 2024

America: హైద‌రాబాద్ విద్యార్తిపై దాడి…ఆదుకోవాలని అర్థ‌నాదాలు….

ఆమెరికాలో భార‌తీయ విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌రువైంది. ఇటీవ‌ల ఆమెరికాలో భార‌తీయ విద్యార్థుల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించేందుకు వెళ్లిన విద్యార్థుల‌పై దాడులు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మజహిర్‌ అలీ అనే విద్యార్థిపై అమెరికాలోని షికాగోలో దాడి జరిగింది. దారి దోపిడీకి పాల్ప‌డిన న‌లుగురు దొంగలు అతని వద్ద ఉన్న సొమ్ము కోసం తీవ్రంగా కొట్టారు.

అయితే అతడు నివసిస్తున్న ప్రాంతంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ ఓ వీడియోలో అత‌ను వేడుకోవడం కనిపిస్తోంది. త‌ల, ముక్కు, మూతి నుంచి ర‌క్తం కారుతుండ‌గా తీవ్ర గాయాలైన అతడు వీడియో రికార్డు చేస్తూ అందులో తనను ఆదుకోవాలని కోరాడు. ఆ వీడియోను నెట్టింట పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సయ్యద్‌ మజహిర్‌ అలీ ఇండియన్‌ వెస్లియన్‌ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్‌ చేస్తుండగా.. తన భ‌ర్త‌ను ఆదుకోవాల‌ని అతడి భార్య ఫాతిమా రిజ్వీ కేంద్ర విదేశాంగ శాఖ‌ను కోరింది. ఆయ‌న‌కు మంచి చికిత్సను అందించాల‌ని మంత్రి జైశంక‌ర్‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement