Thursday, May 2, 2024

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ – మ‌రో ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. పేపర్‌ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. ఏఈఈ పేపర్‌ కూడా లీక్‌ కావడంతో, ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఏఈఈ పరీక్ష పేపర్‌ను ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ లీక్‌ చేసి ఒక్కో పేపర్‌ను రూ.10 లక్షలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురికి ఏఈఈ పేపర్‌ను ప్రవీణ్‌ అమ్మాడని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈకేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా, తాజాగా మురళీధర్‌, మనోజ్‌తో పాటు మరో వ్యక్తిని సిట్‌ అధికారులు అరస్టు చేసినట్లు సమాచారం. దీంతో పేపర్‌ లీకేజీ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 21 మంది అరెస్టు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement