Sunday, May 5, 2024

జిల్లా మంత్రికి అందని ఆహ్వానం.. మార్కెట్ చైర్మెన్ పై జడ్పీ చైర్మన్ అసంతృప్తి

యాదాద్రి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మోడల్ రైతు బజార్ ప్రారంభోత్సవ సమావేశంలో జడ్పి చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్ చైర్మెన్ నల్లమాస రమేష గౌడ్ ను ఆయన చురకలంటించారు. జిల్లా మోడల్ రైతు బజార్లో ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదు అని ప్రశ్నించారు. జిల్లా మంత్రిని ఎందుకు పిలవలేదని, సంబంధిత శాఖ మంత్రికి ఎందుకు ఆహ్వానించలేదు అని నిలదీశారు. జిల్లాలో ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారని, అందులో ఫ్లెక్సీ పై ఒకరి ఫోటో పెద్దగా, మరొకరి ఫోటో చిన్నగా వేయడం ఏంటని ? మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి కావాలంటే రాష్ట్ర మంత్రులు పిలవాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement