Thursday, April 25, 2024

పాఠశాలల అభివృద్ధికే ‘మన ఊరు- మనబడి’

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మన బడి కార్యక్రమం చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని మల్యాల పాఠశాలలో రూ.25.91 లక్షలతో మౌళిక వసతుల కల్పన కోసం చేపట్టిన పనులకు ఎమ్మెల్యే దాసరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా విద్యా బోధన జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement