Wednesday, May 8, 2024

TS: ఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల ఫైన్ వేసిన హైకోర్టు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయిన కోర్టు.. రూ.10వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2018 ఎన్నికల సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఆస్తుల లెక్కలు సరిగా చూపలేదని, సునీత ఎన్నిక చెల్లదంటూ సతీశ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేకు ఫైన్ విధించిన కోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement