Saturday, May 4, 2024

ADB: అంబులెన్స్ ను ప్రారంభించిన జడ్పీ చైర్మన్

ఉట్నూర్, ఆగస్టు 10 (ప్రభన్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రెండు 108 వాహనాలను ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేయగా, వాటిని గురువారం ఉట్నూర్ లో అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్థన్ రాథోడ్ అంబులెన్స్ లకు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు రెండు అంబులెన్స్ లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డివిజన్ ఈఎంఈ కొండలరావ్, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ ఎండీ సలీముద్దీన్, లక్కారం మాజీ సర్పంచ్ తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు కాటం రమేష్, ధావుల రమేష్, అబుజర్, కామేరి రాజు, శ్రీకాంత్, 108 ఈఎంటీలు రాజశేఖర్, దత్తాత్రేయ గణేష్, ధరమ్ సింగ్ రాజేశ్వర్, రాజేష్, వెంకటేష్, బాపూరావ్, సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement